ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు..

కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది

Mar 25, 2023 - 11:24
 0
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు..

మనభారత్ న్యూస్, 25 మార్చి 2023, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ఖరారు చేసింది..

రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిచేసిన అధికారులు.. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 4న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఈ ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వారిలో 11,574 మంది మాత్రమే మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్