టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం - శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

Jul 4, 2023 - 15:36
 0
టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం -  శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

మనభారత్ న్యూస్, 07 జులై 2023, ఆంధ్రప్రదేశ్ : అనుమంచిపల్లి గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు ప్రచారం చేస్తూ ముఖ్యఅతిథిగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు  గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ, 18 ఏళ్ల నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు  చదువుతూ ఉంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15000 ఇస్తామని, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం, టికెట్ లేని ప్రయాణం కల్పిస్తామని అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం చేస్తామని, నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు   నెలకు 3000 నిరుద్యోగ భృతి కల్పిస్తామని, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారిని అన్ని విధాల ఆదుకుంటామని,  ఇంటింటికి మంచినీటి పథకం కింద ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ ఇస్తామని, ప్రచారం చేస్తూ గ్రామంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ప్రచారం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు యానాల గోపీచంద్, కసుకుర్తి శ్రీనివాసరావు, అక్బర్, చెరుకూరి లవయ్య, గద్దె రాజ్యలక్ష్మి, ఇంటూరి రఘు, అప్పన రమణయ్య, ఎస్కే మహమ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షులు బలిగొర్ల కోటేశ్వరరావు, కట్టబోయిన నాగరాజు, పొన్నెబోయిన బ్రహ్మయ్య, గవిని సత్యం, వీరస్వామి దాచేపల్లి లక్ష్మీనారాయణ, జోన బోయిన గోపి, శ్రీను, భాదే వీరయ్య, గురు ప్రసాద్, భాష చిరుమామిళ్ల సతీష్, గంగుల రామారావు, గద్దె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్