రాజ్‌భవన్‌కు వెళ్లిన జనసేనాని

గంటపాటు గవర్నర్‌తో భేటీ

Mar 15, 2023 - 09:07
Mar 15, 2023 - 18:42
 0
రాజ్‌భవన్‌కు వెళ్లిన జనసేనాని

మనభారత్ న్యూస్, ఆంధ్రప్రదేశ్, 14- మార్చి 2023 : పవన్ కల్యాణ్ ఇవాళ రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. పవన్ కల్యాణ్ సుమారు గంట పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు.ఈ మర్యాదపూర్వక సమావేశంలో పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులు, తాజా పరిణామాలపై పవన్ కల్యాణ్ గవర్నర్ తో చర్చించారు. కాగా, రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ జరగనుంది. పవన్ కల్యాణ్ తొలిసారిగా వారాహి వాహనం ఎక్కి ఈ సభకు విచ్చేయనున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ సభ ద్వారా పవన్ తన కార్యాచరణ ప్రకటిస్తారని భావిస్తున్నారు.

గత మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉన్నారు. బీసీ సామాజివర్గం కార్యకర్తలతో పాటు కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు. రేపు జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి కూడా నేతలతో చర్చించనున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్