జగ్గయ్యపేటలో దివంగత డాక్టర్ కొణిజేటి రోశయ్య గారి 90వ జయంతి సందర్భంగా నివాళులు

Jul 4, 2023 - 14:23
 0
జగ్గయ్యపేటలో దివంగత డాక్టర్ కొణిజేటి రోశయ్య గారి 90వ జయంతి సందర్భంగా నివాళులు

మనభారత్ న్యూస్, 07 జులై 2023, ఆంధ్రప్రదేశ్ : జగ్గయ్యపేట పట్టణం బస్టాండ్ ఎదురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు,మాజీ గవర్నర్ దివంగత డాక్టర్ కొణిజేటి రోశయ్య గారి 90వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు.

ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని ,ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి కొణిజేటి రోశయ్య గారిని తెలిపారు ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గా మరియు తమిళనాడు మాజీ గవర్నర్ గా ఆయన అందించిన సేవలను కొనియాడారు,రాజకీయాల్లో నైతిక విలువలు,క్రమశిక్షణ ,అంకిత భావం తో పనిచేయాలని స్పూర్తి కలిగించిన వ్యక్తి కొణిజేటి రోశయ్య గారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మానేపల్లి బ్రహ్మం, సచివాలయల కన్వీనర్లు తుమ్మేపల్లి నరేంద్ర,కన్నమాల శామ్యూల్,పట్టణ అనుబంధ విభాగాల అధ్యక్షులు చారుగుండ్ల కొండ,గోగుల వెంకయ్య,కౌన్సిలర్లు గింజపల్లి వెంకటరామయ్య,డేవిడ్ రాజు,నాయకులు గేల్ల పూర్ణచంద్రరావు,కొత్త పురుషోత్తం,నోముల శ్రీను, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్